Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్వయంకృషి ఖాతాదారులకు రూ.3.5కోట్ల శఠగోపం?
posted on: Jun 22, 2012 5:49PM
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో స్వయంకృషి బ్యాంకు బోర్డు తిప్పేసింది. రోజువారీ అకౌంట్లు, డిపాజిట్లు వెరసి రూ.3.5కోట్లకు ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టేసింది. కంప్యూటీకరణ పేరుతో ముందస్తు ప్రణాళిక ప్రకారం బ్యాంకు మూసేసి సిబ్బంది ఉడాయించారు. ఈ మైక్రోఫైనాన్స్ సంస్థలో సుమారు 25వేల ఖాతాలున్నాయి. రెండేళ్ల కిందట మార్కెట్ఫీడర్రోడ్డులో దీన్ని అంగరంగవైభవంగా ప్రారంభించారు. ప్రతీ గ్రామంలోనూ స్వయంకృషిబ్యాంకు ఏజెంటున్నాడు. ఈ నియోజకవర్గంతో పాటు మడకశిర, పెనుకొండ, గోరంట్ల, కర్ణాటకరాష్ట్రంలోని గౌరీబిదనూరు, పావడ, మధుగిరి ప్రాంతాల నుంచి వందలాది మంది ఇందులో ఖాతాలు తెరిచారు. ముదిరెడ్డిపల్లి చేనేత కార్మికులే కోటి రూపాయలకుపైగా ఈ బ్యాంకులో దాచుకున్నారు. ఈ బ్యాంకు ఇచ్చిన పత్రాల్లో ఉన్న ఆధారాల ప్రకారం పరిశీలిస్తే రిజిష్టరు ఆఫీసు, హెడ్డాఫీసు, మొదటి అంతస్తు, డిఆర్వీప్లాజా, పాతబస్టాండుదగ్గర, బీబీరోడ్డు, దేవనహళ్లి, బెంగుళూరు రూరల్ జిల్లా`560110 చిరునామాను సంప్రదిస్తే అక్కడ అటువంటి బ్యాంకు లేదని తేలింది. అంతేకాకుండా ఫొనునెంబర్లు 080`27683775, 27682888 కూడా పని చేయటం లేదు. పదేళ్లలో ఇలానే పలు కంపెనీలు స్థానికులను మోసం చేశాయి. తమిళనాడుకు చెందిన వ్యాపారి ఎస్ఆర్ ఏజెన్సీ పేరుతో నెలరోజుల్లో రెట్టింపు ఇస్తామని ఇక్కడ అరకోటి వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.





