Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హంద్రీనీవా గుత్తేదారుపై సర్కారు ప్రేమ?
posted on: Jun 22, 2012 5:45PM
హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కుంటూనే ఉంది. ఇక్కడ పనులు చేయకుండా గుత్తేదారు సొమ్ము చేసుకున్నారని విచారణాధికారి నిర్ధారించారు. తగిన ఆధారాలు ఉన్నందున గుత్తేదారుపై చర్యలకు సిఫార్సు చేశారు. అయినా ప్రభుత్వం ఆ సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫైలు పక్కన పడేసింది. ఎందుకీ గుత్తేదారుపై సర్కారుకు ప్రేమ పొంగుతోందని కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పథకం కింద 23వ ప్యాకేజీ పనిని బ్యాక్బోన్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ చేయని పనులకు అదనపు బిల్లులు పెట్టి కోట్ల రూపాయలు పొందింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ పనిపై విచారణ జరిపి పనితో సంబంధమున్న ఇంజనీర్లను ప్రభుత్వం సాయంతో సస్పెండ్ చేయించింది. ఈ కేసులో చిక్కుకున్న ఇంజనీర్లకు పదవీవిరమణ తరువాత పూర్తిస్థాయి పింఛను కూడా చెల్లించలేదు. ఇంజనీర్లతో పాటు బ్యాక్బోన్ సంస్థపైనా, పని చేశారని ధృవీకరించిన థర్డ్పార్టీ నాణ్యతా సంస్థ పైనా చర్య తీసుకోవాలని విచారణాధికారి ప్రభుత్వానికి తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేసింది. గుత్తేదారుపై చర్యతీసుకుంటే ఇంకెందరిపై చర్యలు తీసుకోవాలో అన్నట్లు మౌనముద్ర దాల్చింది. తాజాగా విజిలెన్స్ కమిషన్ నీటిపారుదల శాఖకు రాసిన లేఖలో ఆ చర్యలు గురించి ప్రస్తావించింది. గుత్తేదారును బ్లాక్లిస్టులో పెట్టడంతో పాటు థర్డ్పార్టీ సంస్థను తొలగిస్తూ చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన సమాచారం తమకు అందజేయాలని విజిలెన్స్ లేఖలో కోరింది.






