జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన హైకోర్టు

posted on: Jun 22, 2012 3:18PM

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న వైస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. హైకోర్టు ఈకేసు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని కోర్టు ఆదేశించింది. కాగా జగన్ బెయిల్ పైన సిబిఐ 27వ తేదిలోగా కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురయింది. సిబిఐ అక్కడ ఏం వాదనలు వినిపించిందో ఇక్కడా అవే వినిపించే అవకాశముంది. జగన్ ఆస్తుల కేసు కీలక దర్యాఫ్తులో ఉందని, ఇలాంటి సమయంలో జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని, సాక్ష్యులను బెదిరించే అవకాశముందని సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశముంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...