సిబిఐ జెడి ఫోన్ కాల్స్ పై వివరణ ఇచ్చిన చంద్రబాల

posted on: Jun 22, 2012 2:33PM

సిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణతో అత్యధిక ఫోన్లు మాట్లాడారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆరోపించిన వాసిరెడ్డి చంద్రబాల శుక్రవారం మీడియా ముందు వివరణ ఇచ్చారు. తాను ఎంపవరింగ్ యూత్ ప్రోగ్రాం లీడ్ ఇండియాలో ఆరు నెలలుగా పని చేస్తున్నానని చెప్పారు. లీడ్ ఇండియా కార్యక్రమాల కవరేజ్ కోసమే తాను ఎబిఎన్ ఛానల్‌కు ఫోన్ చేశానని చెప్పారు. లీడ్ ఇండియా కార్యక్రమాల కవరేజ్ కోసం తాను సాక్షి ప్రతినిధులతోనూ మాట్లాడానని చెప్పారు. ఈ ప్రోగ్రాంను ప్రమోట్ చేయాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ తన క్లాస్ మేట్ అని చెప్పారు.స్నేహితులుగా మేం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, పలు కార్యక్రమాలకు లక్ష్మీ నారాయణ సహకరించారని చెప్పారు. తాను గురువారం అంతా శ్రీశైలంలో ఉన్నానని చెప్పారు. తనకు అప్పుడు బెదిరింపు కాల్సు వచ్చినట్లు చెప్పారు. తమ ప్రోగ్రాం కోసం ఎంతోమందికి ఫోన్ చేస్తుంటామని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...