బోత్సాపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

posted on: Jun 22, 2012 10:04AM

ఉపఎన్నికల ఫలితాలు దారుణంగా ఉన్నాయంటూ పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. దీనికి పీసీసీ సమావేశంలో తాను సేకరించిన బొత్సా కేంద్ర నాయకుల ముందుంచారు. ఆ కారణం విననైనా వినకుండానే నాయకులు బోత్సాపై సీరియస్ అయ్యారు. దీంతో ఏమిచేయాలో అర్థం కాక బొత్సా తాను తీసుకున్న వివరాలను సమావేశంలో కేంద్రనాయకుల చేతికి ఇచ్చేసి వచ్చారు. సోనియా తరపున కూడా బోత్సాకు అక్షింతలు వేసి పంపించారు. ఎలానూ వచ్చాం కాబట్టి ప్రణబ్ ముఖర్జీని కలిసి మర్యాదపూర్వకంగా అభినందించి బొత్సా తిరుగు ప్రయాణమై వచ్చారు. వచ్చినది మొదలు కాంగ్రెస్ నాయకులను కలవకుండా బొత్సా ఇంటిదారి పట్టారు. కాంగ్రెస్ చైర్మన్ సోనియాగాంధీ ఉపఎన్నికల ఫలితాలు సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24, 25తేదీల్లో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణలతో ఈ చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారటానికి అవకాశం ఎలా ఏర్పడిందన్న అంశాలపై ఆమె ప్రధానంగా చర్చిస్తారు. సిఎంతో మాత్రం జగన్ అక్రమాస్తుల కేసులో ఇడి కనుక ఆయన్ని తరలిస్తే వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడతారని సమాచారం. ఏదేమైనా వీరిద్దరిలో ఒకరి మార్పు ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...