జగన్ ఆస్తుల కేసు: హైకోర్టులో బెయిల్ పిటిషన్

posted on: Jun 21, 2012 5:41PM

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ బెయిల్ మంజూరు చేయాలనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఆయన మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను ప్రస్తుతం లోకసభ సభ్యుడ్నని, రాజకీయ కారణాలతోనే సిబిఐ తనను అరెస్టు చేసి తనపై అభియోగాలు మోపిందని ఆయన అన్నారు. తొమ్మిది నెలల పాటు దర్యాప్తు సాగించినా తనకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించలేకపోయిందని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు సిబిఐ చేపట్టిన విచారానికి సహకరించనని పిటిషన్ లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేస్తే సిబిఐ విచారణకి సహకరిస్తారని ఆయన అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...