కారును షెడ్డులో పడేయాలంటున్న కమలనాథులు

posted on: May 19, 2012 12:05PM

భారతీయజనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంచి ప్రసంగకర్త, విమర్శకుడు. ఆయనే కనుక మేలికపెడితే ఎలా వుంటుందో ఒక్కసారి రుచి చూసిన వారు జీవితంలో మరువలేరు. అంతటి ఘాటైన విమర్శలు చేసే కిషన్ రెడ్డి ఓ కొత్త మెలిక పెట్టి తెలంగాణా రాష్ట సమితిని ఇరుకున పెట్టారు. "తెలంగాణా కోసమే టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఇక పోటీ నుంచి తప్పుకోవాలి .... ఎందుకంటే తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం తీసుకురావటం టి.ఆర్.ఎస్. కు చేతకాదు. అది తేవాలంటే కేంద్రస్థాయి నుంచి కింది దాకా ఉండే ఒక్క బిజెపికే సాధ్యం. అందుకని తెలంగాణా కోసం మా వెనుకే ఉంటే చాలు.

 

అసలు తెలంగాణా కేసిఆర్ జీవితలక్ష్యమైతే దాన్ని నెరవేర్చుకునేందుకు సహకరించా ల్సిందే. తెలంగాణలో ఒక్క టి.ఆర్.ఎస్. మాత్రమే ఉండదని మహబూబ్ నగర ఎన్నికల్లో మా పార్టీ విజయం నిరూపించింది. ఆ అక్కసుతోనే కేసిఆర్, జెఎసి చైర్మన్ కోదండరామ్ ను పదవి నుంచి తప్పించేందుకు చూస్తున్నారు. అలానే తెలంగాణా రావాలంటే టిడిపి అధినేత చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేయాలి. ఆయనే తెలంగాణా వ్యతిరేకి'' అని కిషన్ రెడ్డి చేసిన ప్రసంగం తెలంగాణలో సంచలనమైంది. ఈ సంచలన ప్రకటన టి.ఆర్.ఎస్.పై కోపంగా ఉన్న తెలంగాణావాదులను బిజెపి వైపు మళ్ళించవచ్చని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. కిషన్ రెడ్డి రెచ్చిపోయి చేసిన ఈ ప్రకటనపై టి.ఆర్.ఎస్. నాయకులు తీవ్రంగా స్పందించారు. మతతత్వ పార్టీ అయిన బిజెపి కు తెలంగాణాను తెచ్చెంత సీన్ లేదని అయితే సమైఖ్యవాదులనుంచి ముడుపులు తీసుకున్న ఆ పార్టీ నాయకులు తెలంగాణా వాదంలో చీలికకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పరకాల ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్టుకూడా దక్కదని ఎద్దేవా చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...