ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సినీస్టార్లు

posted on: May 18, 2012 2:29PM

ఈ పాట తెలుగునాట చాలా పాపులారిటీ సంపాదించింది. అప్పట్లో ఈ పాట సాహిత్యం కూడా పలువురి ప్రశంసందుకుంది. కానీ, ఈ పాటను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. అదే మన రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికల కోసం మూడు ప్రధానపార్టీలూ ప్రచారానికి తమ నేతలు, సినీతారలను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి.

దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తమ తరపున ఎన్నికల బాధ్యతలను మోస్తున్న మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో పాటు మరో ముగ్గురిని రంగంలోకి దించుతుంది. వారితో ముందుగానే చర్చించి ఈ మేరకు షెడ్యూల్స్ కూడా రూపొందించింది. సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధను వచ్చే నెల 2వ తేదీనుంచి ప్రచారం చేయాలని కాంగ్రెస్ కోరింది. అలానే సినీనటి జీవిత, హీరో రాజశేఖర్ దంపతులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయటానికి సిద్ధమయ్యారని సమాచారం. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తరుపున సినీనటి రోజా ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఆమెతో పాటు జయలలిత, విజయ్ చందర్, ధర్మవరపు సుభ్రహ్మణ్యం తదితరులు ఈ పార్టీ ప్రచారంలో పాలు పంచుకుంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి బాలకృష్ణ, కవిత తదితరు లు ప్రచారం చేస్తారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...