Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
posted on: Feb 22, 2012 1:45PM
హైదరా
బాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు అప్పుల్లో ముంచిందన్నారు. రిజర్వేషన్లు తగ్గించడంపై ఆయన మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ సరైన రిజర్వేషన్లు కల్పించారన్నారు. వెనుక బడిన తరగతులను నిర్లక్ష్యం చేస్తే టిడిపి చూస్తూ ఊరుకోదన్నారు. ప్రభుత్వం వివిధ రకాల పన్నులతో ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. చివరకు జుట్టు పన్ను కూడా వేసేట్టు ఉందన్నారు. అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉందన్నారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు సాయం చేస్తుందంటే నమ్మాలా అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ప్రభుత్వం వైఖరి కారణంగా రైతులు వ్యవసాయం మానుకునే పరిస్థితి దాపురించింద్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాల సంగతి తేలుస్తామన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞాన్ని మార్చిందన్నారు. ప్రజా సమస్యలు చెబుతుంటే ముఖ్యమంత్రికి నవ్వు వస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత మాదేనన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష నుండి తప్పించుకోలేరన్నారు. కాంగ్రెసు ఫ్యాబ్ సిటీని ఫాల్స్ సిటీగా మార్చిందన్నారు. కాంగ్రెసుకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో రైతుకు మద్దతు ధర ఉంటే మన రాష్ట్రంలోనే లేదన్నారు. ఢిల్లీలో పదవుల కోసం పైరవీలే తప్ప ప్రజా సమస్యలు వీరికి పట్టడం లేదన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు భారీగా ఉన్నాయన్నారు.


.jpeg)



