Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీలక్ష్మి కేసులో కొత్త మలుపు
posted on: Feb 21, 2012 3:15PM
న్యూఢి
ల్లీ: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కేసు కొత్త మలుపు తిరిగింది.ఆమె పై చార్జీషీట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని సిబిఐ మంగళవారం సుప్రీం కోర్టును కోరింది. తనకు బెయిల్ ఇవ్వాలని శ్రీలక్ష్మి ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ఇరువైపుల లాయర్ల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణనను ఈ నెల 27కు వాయిదా వేసింది. శ్రీలక్ష్మిపై చార్జిషీట్ 60 రోజుల్లో దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ సిబిఐ అధికారులు ఇంకా దాఖలు చేయలేదని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వాదించారు. అందుకు సిబిఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ శ్రీలక్ష్మి కేవలం గాలి గనుల కేసులో అక్రమాలకు పాల్పడటమే కాకుండా అదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పారు. ఆమెపై 90 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేయవచ్చునని, అందుకు మార్చి 31 వరకు తమకు అవకాశముందని చెప్పారు. శ్రీలక్ష్మి కోరుతున్నట్లు బెయిల్ ఇవ్వవద్దని సుప్రీం కోర్టును సిబిఐ విజ్ఞప్తి చేసింది. ఆమెను మరోసారి విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. దీంతో కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా గాలి గనుల కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి కేసు మలుపు తిరగడం గమనార్హం. ఓఎంసి కేసులో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆమెను కొత్త చిక్కులు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.


.jpeg)
.jpg)


