మంత్రి మోపిదేవికి బిగుసుకుంటున్న ఉచ్చు

posted on: Feb 21, 2012 3:05PM

హైదరాబాద్: మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఎసిబి అదుపులో ఉన్న నున్న రమణ కీలక సమాచారం అందించాడు. మంత్రి తన ఇంట్లోనే రెండు గ్రూపుల తగాదాలు పరిష్కరించారని రమణ తెలిపాడు. ఆ రెండు గ్రూపుల మధ్య రాజీ కుదిర్చి మంత్రి మోపిదేవి పది లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించాడు. రమణ నేరాంగీకార పత్రంలో పేర్కొన్న విషయాలపై ఎసిబి అధికారులు దృష్టిసారించారు. మరో 14 మంది మద్యం వ్యాపారులపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...