ఆ రెండు చానల్స్ బహిష్కరణకు కు చంద్ర బాబు నిర్ణయం

posted on: Jan 27, 2012 8:24AM

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికను, టీవీ చానెల్‌ను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా వెలువడుతుందని నమస్తే తెలంగాణ పత్రికపై, టీ చానెల్‌పై కూడా ఆ పార్టీ అదే నిర్ణయం తీసుకుంది.పార్టీ అధినేత చంద్రబాబుతో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు తదితరులు  సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఆ రెండు చానెళ్లు, పత్రికల్లో తమ పార్టీపై, పార్టీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురిస్తున్నారని  పలువురు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ చానెళ్లు, పత్రికల తీరుపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వాటి తీరులో ఎటువంటి మార్పు లేదన్న అభిప్రాయంతో చంద్రబాబు ఏకీభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఆ పత్రికలు, చానెళ్లను బహిష్కరించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో బహిష్కరణ నిర్ణయాన్ని టీడీపీ అధికారికంగా ప్రకటించనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...