జగన్ కు వందకోట్లపైనే ముడుపులు ముట్టాయి

posted on: Jan 26, 2012 3:27PM

హైదరాబాద్‌ : విల్లాల కేటాయింపులో జగన్‌కు ముట్టిన ముడుపులు వంద కోట్లకు పైబడే ఉంటాయని నానక్‌రామ్‌గూడ ప్లాట్‌ ఓనర్స్‌ సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కడియాల రాజేంద్ర అన్నారు. ఎమ్మార్‌ కుంభకోణంలో నష్టపోయిన నానక్‌రామ్‌గూడ భూ బాధితులు తరుపున ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్న ఆయన తాజాగా సునీల్‌రెడ్డి అరెస్ట్‌పై స్పందించారు. విల్లాల కేటాయింపులో కీలక వ్యక్తిగా వ్యవహరించి జగన్‌కు వందల కోట్లు దోచిపెట్టిన సునీల్‌రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పడం జగన్‌ అబద్ధాలకు పరాకాష్టగా ఆయన చెప్పారు. ఎమ్మార్‌ కుంభకోణంలో 12వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...