ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు గుండెపోటు
Published on: Tue Nov 26, 2024 8:34AM
.webp)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గుండె నొప్పితో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెబుతున్నారు. సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి ఇంకా హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 2018 సంవత్సరంలో ఆర్బిఐ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పదవీ కాలం డిసెంబర్ 10తో ముగియనుండగా, మరో రెండేళ్లు పొడిగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.


