ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. ఇబ్బందులు తప్పవు.. రాయపాటి

posted on: May 4, 2016 12:29PM

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హామీలు ఇచ్చాయి.. ఇప్పుడు ఆహామీలను పెద్దలు నెరవేర్చాల్సిందే అని డిమాండ్ చేశారు. అంతేకాదు నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు.. దానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ కూడా ప్రధాని ప్రకటనను స్వాగతించి.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.. ఇప్పుడు వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...