రాయల తెలంగాణాకు నో
posted on Dec 2, 2013 6:38AM
తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం వేగంగా అడుగులు వేస్తుంది. అందులొ భాగంగా ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీ శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లారు.రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్తో భేటి అయిన ఆయన ముఖ్యంగా రాయల తెలంగాణ అంశం చర్చించినట్టుగా సమాచారం. అయితే విభజన విషయాన్నిసానుకూలంగా పరిష్కరించటానికే రాయల తెలంగాణ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చినట్టుగా దిగ్విజయ్, డియస్కు వివరించారు.
అయితే రాయల తెలంగాణ అంశాన్ని తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా అంగీకరించారని డియస్, దిగ్విజయ్కి స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతికి, రాయలసీమ సంస్కృతికి చాలా వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి రాయల తెలంగాణ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.