Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బస్సులో అత్యాచారయత్నం, హత్య
posted on: Apr 30, 2015 7:49PM

పంజాబ్లోని మొగా పట్టణంలో కదులుతున్న బస్సులో ప్రయాణిస్తున్న 14 ఏళ్ళ బాలికను కొంతమంది దుండగులు వేధించి అత్యాచారం జరపడానికి ప్రయత్నించారు. ఆ బాలిక ప్రతిఘటించడంతో ఆమెను బస్సు నుంచి కిందకి తోసేసి చంపేశారు. తన తల్లి, తమ్ముడితో కలసి ఆ బాలిక బస్సులో ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. అత్యాచారం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ కూడా వున్నారు. బాలికను దుండగులు వేధిస్తూ అత్యాచారానికి ప్రయత్నిస్తూ వుండగా ఆమె తల్లి వాళ్ళను నిలువరించాలని ప్రయత్నించింది. బస్సును ఆపాలని కోరినా డ్రైవర్ ఆపలేదు. చివరికి ఆ దుండగులు ఆ బాలికను, ఆమె తల్లి, తమ్ముడిని బస్సులోనుంచి కిందకి తోసేయడంతో ఆ బాలిక మరణించింది. తల్లి, తమ్ముడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరం జరిగిన బస్సు ఆర్బిట్ అనే కంపెనీకి చెందింది. ఈ బస్సులో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్కి చెందినది. దాంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రకాష్ సింగ్ బాదల్ ఈ ఘటన పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ బస్సు తమకు చెందినదే అని, ఈ ఘటనకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.



.jpg)


