రామోజీ కోడలు... జగన్ భార్యకు స్నేహం ఉందా?

posted on: Sep 25, 2015 12:26AM

రాజకీయంగానూ, వ్యాపారపరంగా, ప్రతికాధిపతులుగానూ భిన్న ధృవాలైనా రామోజీ-జగన్ భేటీ వెనుక ఆయన కోడలు శైలజాకిరణ్ ఉన్నారనే వార్తలు వినపడుతున్నాయి. మంచు మనోజ్ పెళ్లిలో కలిసిన శైలజాకిరణ్, జగన్ భార్య భారతి కొద్దిసేపు మాట్లాడుకున్నారని, అది వారిద్దరి మధ్యా సత్సంబంధాలు ఏర్పడ్డటానికి దోహదపడిందని చెబుతున్నారు. ఆ సత్సంబంధాలే జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలిసేలా చేశాయని అంటున్నారు. ఎవరితోనూ శత్రుత్వం వద్దన్న శైలజాకిరణ్ సూచన మేరకే జగన్ కు రామోజీ అపాయింట్ మెంట్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలవడం జగన్ కు పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెడుతుందని, కమ్మ కమ్యూనిటీలో జగన్ పై కొంత సానుకూలత ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...