రాముని మందిరాన్ని మేమే నిర్మిస్తాం

 

సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే రాజకీయ మద్దతు లేకున్నా రాముని మందిరాన్ని నిర్మించి తీరుతామని ద్వారక పీఠాధిపతి, ఆధ్యాత్మిక మతగురువు సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో మెజారిటీ లేకుండా రాముని ఆలయం కట్టడం సాధ్యం కాదని చెప్పిన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. బీజేపీ నాయకులు ఇకనైనా రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడం ఆపాలని, బీజేపీ నాయకులపైనా, ఎన్డీయే సర్కారుపైనా మండిపడ్డారు. రామ మందిరానికి రాజకీయ నాయకుల డబ్బులు తమకు అవసరం లేదని.. ప్రజలు సాధువుల సహాయంతో నిర్మిస్తామని స్పష్టం చేశారు.