నేపాల్ బాధితులకు చరణ్ సాయం

 

దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందరికంటే ముందుగా స్పందించే తెలుగు చిత్ర పరిశ్రమ నాలుగు రోజుల క్రితం నేపాల్లో సంభవించిన పెను భూకంపం పట్ల ఎందుకో చాలా ఉదాసీనంగా ఉండిపోయింది. ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ ఒక్కరే స్పందించారు. భూకంప బాధితులకు అపోలో ఆస్పత్రి తరపున మందులు పముపుతామని, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ నుంచి అవసరమయిన చేయూతనిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో అందరూ కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి నేపాల్ భూకంప బాధితులకు విరాళాలు అందజేస్తే బాగుంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu