TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

Published on: Tue May 24, 2016 12:26PM

 

రాజ్యసభలో దాదాపు 57 మంది సభ్యుల పదవీకాలం ముగియడంతో సీట్లు ఖాళీ అవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ 57 మందిలో ఏపీ నుండి నలుగురు సభ్యులు, తెలంగాణ నుండి ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాల ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి జూన్ 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం వరకు కౌంటింగ్ కూడా పూర్తి కానుంది. కాగా తెలంగాణలో గుండు సుధారాణి (టీడీపీ), వి.హన్మంతరావు (కాంగ్రెస్) పదవి కాలం పూర్తి కాగా.. ఏపీలో నిర్మలా సీతారామన్ (బీజేపీ), జేడీ శీలం (కాంగ్రెస్), సుజనా చౌదరి, సీఎం రమేశ్ (టీడీపీ)ల పదవీ కాలం ముగియనుంది.