Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇది తెలుగు ప్రజలు కోరుకున్న విజయం
posted on: Apr 17, 2015 1:52PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికైన విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్ ప్యానల్లోని మరికొంతమంది కూడా ఈ ఎన్నికలలో విజయం సాధించారు. ఈ విజయం పట్ల ‘మా’ నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారందరూ కోరుకున్న విజయమని ఆయన అన్నారు. ‘‘ఎన్నో పరీక్షలను తట్టుకుని, దాటుకుని ఈ ఎన్నికలలో విజయం సాధించాం. ఈ క్షణం నుంచి నేను అధ్యక్షుడిగా వున్నంతకాలం అసోసియేషన్ డబ్బులతో కనీసం టీ కూడా తాగను. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. సినిమా కళాకారులందరూ నవ్వుతూ బతకాలన్నదే నా కోరిక. ఎన్టీఆర్ స్ఫూర్తితో కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఈ విజయాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నాను. నా విజయాన్ని కోరుకున్న, నాకు విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.






