షారుఖ్ పై శిల్పా శెట్టి విజయం
posted on Apr 9, 2013 8:46AM
ఐపిఎల్-6 లో సోమవారం జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో శిల్పా శెట్టి ఫ్రాంచైజ్ గా వున్న రాజస్థాన్ రాయల్స్ షారుఖ్ ఖాన్ ఫ్రాంచైజ్ గా వున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఐదు పరుగులే చేశాడు. రహానే 34 బంతుల్లో 36 పరుగులు (3ఫోర్లు, 1సిక్సర్) చేశాడు. ద్రావిడ్ 20 పరుగులు, స్టువర్ట్ బిన్నీ 11 పరుగులు చేసి వెనుతిరిగారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో బ్రాడ్ హాడ్జ్ 31బతుల్లో 46పరుగులు, వికెట్ కీపర్ యాజిక్ట్ 11బతుల్లో 16 పరుగులు అండతో ఒక్కడే చెలరేగి ఆడడంతో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైట్ రైడర్స్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ ధాటిగా ప్రారంభించాడు. మూడో ఓవర్లో రాహుల్ శుక్ల వేసిన చక్కటి బంతికి మన్విందర్ బిస్లా క్లీన్ బౌల్డ్ కాగా, క్రీజ్ లోకి వచ్చిన వెంటనే కల్లీస్ కూడా ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లును పోగొట్టుకుంది. 7వ ఓవర్ వేసిన సిద్ధార్థ త్రివేది కూడా రెండు వికెట్లను తీశాడు. మొదట మనోజ్ తివారీని ఎల్బీడబ్ల్యూగా, గౌతమ్ గంభీర్ ను స్లిప్ లో యాజ్ఞిక్ క్యాచ్ పట్టడం ద్వారా పెవిలియన్ కు పంపించాడు. ఇయాన్ మోర్గాన్ ఇచ్చిన క్యాచ్ ను వాట్సన్ జారవిడవడంతో పుంజుకున్న మోర్గాన్ కూపర్ బౌలింగ్ లో 51 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించకపోవడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ 19 ఓవర్లలో 125 పరుగులు చేసి ఆలౌట్ టో ముగిసింది. యూసఫ్ పఠాన్ 0, లక్ష్మీరతన్ శుక్లా 2పరుగులు, రజత్ భాటియా 12పరుగులు, బ్రెట్ లీ 5పరుగులు, షమీ అహ్మద్ 5 పరుగులు, నరైన్ 2 పరుగులు నాటౌట్ గా ఉన్నారు. సిద్ధార్థ త్రివేది 3 వికెట్లు, కూపర్ 3 వికెట్లు, రాహుల్ శుక్ల 2 వికెట్లు, షాన్ టెయిట్ 1 వికెట్టు, శ్రీశాంత్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 3 కీలకమైన వికెట్లను పడగొట్టిన సిద్ధార్థ త్రివేది కు దక్కింది.