మళ్లీ వర్షాలు పడతాయట
posted on: Apr 18, 2015 11:44AM
.png)
ఇప్పటికే అకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రైతులకు చాలా నష్టం జరిగింది. శనివారం, ఆదివారం కూడా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. బిహార్, జార్ఖండ్ మీదగా ఉత్తరకోస్తా, మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక, కన్యాకుమారి వరకు ద్రోణి ఏర్పడటం వలన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. అందువల్ల రైతులు తమ పంటలను కాపాడుకోవడంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చు.







