Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ పై వెంకయ్యనాయుడు సెటైర్లు
posted on: May 15, 2015 6:12PM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన రైతు భరోసా పాదయాత్రలో భాగంగా అదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సెటైర్లు వేశారు. యూపీఏ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు ఎంతో మంది రైతులు చనిపోతే పట్టించుకోని రాహులు గాంధీ ఇప్పుడు మాత్రం రైతు భరోసా పేరిట పాదయాత్ర చేయడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది, ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి రాకుండా చూసుకునేందుకే రాహులు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా భూసేకరణ చట్టంపై యూపీఏ అనవసరమైన రాద్దాంతం చేస్తుందని, బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ చట్టం కింద కాంగ్రెస్ లక్షల ఎకరాలు భూములను సేకరించి ఇప్పుడు ఈ భూసేకరణ చట్టానికి అడ్డుపడటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నరేంద్ర మోడీ సూట్ వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. గాంధీ, నెహ్రూలు కూడా సూట్ వేసుకున్నారు, ఆసంగతి వారు మర్చిపోయారేమో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.



.jpg)


