కోర్టులో హాజరైన రాహుల్ గాంధీ.. ఎందుకంటే?
posted on: Feb 20, 2026 1:11PM

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువునష్టం కేసు విచారణకు ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ ప్రత్యేక కోర్టుకు శుక్రవారం (ఫిబ్రవరి 20) హాజరయ్యారు.
2018 ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా ధాఖలు చేసిన పరువునష్టం కేసు సుల్తాన్ పూర్ లోని ప్రజాప్రతినిథుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.
ఆ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది.



.webp)



