రాహుల్ జాతీయత వివాదం.. ఆయన ఒట్టి అబద్దాల కోరు.. దిగ్విజయ్ సింగ్
posted on: Nov 18, 2015 10:35AM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయతపై వివాదం ముదురుతోంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ పౌరసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు రాహుల్ భారతీయుడే కాదని.. అతనికి లండన్ పౌరసత్వం ఉందని ఆయన విమర్శించారు. అంతేకాదు దీనిపై ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాసి.. రాహుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ పై చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అనవసరంగా ఆరోపణలను చేస్తున్నారని.. ఆయన ఒట్టి అబద్దాల కోరని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.







