Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ గాంధీ వచ్చేశాడోచ్
posted on: Apr 16, 2015 12:02PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉన్నట్టుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఆ తరువాత రాహుల్ గాంధీ తప్పిపోయాడంటూ, రాహుల్ గాంధీ తప్పిపోయిన విమానం లాంటి వాడు, అంటూ ఎంతో మంది ఆయన పై విమర్శలు చేశారు. రాజస్థాన్ లో అయితే ఏకంగా కొంత మంది పోస్టర్లు కూడా అంటించారు. రెండునెలలు తరువాత ఇప్పుడు రాహుల్ ఇంటికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు తల్లి సోనియాగాంధీ రాహుల్ ఇంటికి వెళ్లారు. ఈనెల 19వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలతో కలిపి భారీ ఎత్తున రైతు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని తలపెట్టింది. ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి ముందుగానే రాహుల్ను రప్పించాలనుకున్న ప్రయత్నాలు సఫలమయ్యాయి.






