Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్ ని పప్పు అన్నాడు... బుక్కయ్యాడు..
posted on: Jun 13, 2017 2:59PM
.jpg)
రాహుల్ గాంధీపై ప్రతిపక్షపార్టీ నేతలు విమర్శలు, కామెంట్లు చేయడం కామన్. కానీ ఈ మధ్య సొంత పార్టీ నేతలే రాహుల్ పై కామెంట్లు చేయడం చూస్తున్నాం. ఇప్పుడు అలా నోరుజారి ఇరకాటంలో పడ్డాడు ఓ నేత. యూపీలోని మీరట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వినయ్ ప్రధాన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వాట్సాప్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో రాహుల్ గాంధీని జనాదరణ కలిగిన నేతగా, రైతు నేతగా, యువనేతగా అభివర్ణించాడు. అయితే రాహుల్ పేరుతో పాటు పప్పూ అని కూడా జతకావడం వివాదాస్పదమైంది. ఇక అంతే ఆ పోస్ట్ చూసిన వెంటనే కొంతమంది కాంగ్రెస్ నేతలు వాట్సాప్ గ్రూపులోనే వినయ్ పై మండిపడ్డారు. ఇక ఆ తరువాత విషయం గమనించిన వినయ్ ఆ పోస్టు తాను పెట్టలేదని, బిజ్ నౌర్ కు చెందిన అనురాగ్ చేసిందని చెప్పారు. కానీ వినయ్ పై మాత్రం విమర్సలు ఆగలేదు.






