పఠాన్ కోట్ లో భద్రత కట్టుదిట్టం.. 'షూట్ ఎట్ సైట్' హెచ్చరికలు..

 

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. జనవరి 2 న జరిగిన ఈ ఘటన తరువాత అక్కడ భారీ బందోబస్తే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్టు కనిపిస్తోంది. ఉగ్రవాదులు మరోసారి విమాన స్థావరంపై విరుచుకుపడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు.. అంతేకాక అనుమానితులెవరైనా కనిపిస్తే కాల్చేస్తామంటూ ‘షూట్ ఎట్ సైట్’ హెచ్చరికలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్లను ఎయిర్ బేస్ గోడలపై అతికించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఆర్మీ, బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఐదు గంటల పాటు పఠాన్ కోట్ సరిహద్దు గ్రామాల్లో కవాతు నిర్వహించారు.