పిఎస్ఎల్‌వి-సి 27 సక్సెస్

 

పిఎస్ఎల్‌వి-సి 27 ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ (షార్) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సి 27 ఉపగ్రహ వాహక నౌక శనివారం సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు నింగిలోకి దూసుకు వెళ్ళింది. ఈ రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1డి ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. దీని తయారీకి 125 కోట్ల రూపాయల వ్యయం చేశారు. ఈ ప్రయోగం సఫలం కావడంతో మన దేశానికి సొంతగా నేవిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వీలు కలిగింది. ఉపగ్రహం ద్వారా 1500 కిలోమీటర్ల పరిధిలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం వుంటుంది.