Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పి.ఎస్.ఎల్.వి సి-30 శాటిలైట్ విజయవంతం
posted on: Sep 28, 2015 8:15AM
.jpg)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈరోజు ఉదయం 10 గంటలకి శ్రీహరికోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి సి-30 విజయవంతం అయ్యింది. భారత్ కి చెందిన ఆస్ట్రో శాట్ తో బాటు విదేశాలకు చెందినా మరో ఆరు ఉపగ్రహాలను కూడా పి.ఎస్.ఎల్.వి సి-30 ద్వారా ఇస్రో శాస్త్రజ్ఞులు నిరేశిత కక్ష్యలోకి విజవంతంగా ప్రవేశపెట్టగలిగారు.
ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రజ్ఞులు సుమారు పదేళ్ళపాటు నిర్విరామంగా శ్రమించారు. 1513 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం కేవలం ఖగోళ పరిశోధనలు మాత్రమే వినియోగిస్తారు. అందుకోసం ఈ ఉపగ్రహంలో అత్యాధునిక అల్ట్రా వయొలెట్ టెలిస్కోపులు, ఇమేజేర్స్, మానిటర్ వంటి పరికరాలను అమర్చారు. బ్లాక్ హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాలు, అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం, నక్షత్రాల ఆవిర్భావం వంటి వాటి గురించి ఈ ఉపగ్రహం ద్వారా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ళపాటు సేవలు అందిస్తుంది.
ఇది ఖగోళ పరిశోధనలకే పరిమితమయిన ప్రయోగం అయినప్పటికీ, ఇండోనేషియా, కెనడా, అమెరికా లకు చెందిన మొత్తం ఆరు విదేశీ ఉపగ్రహాలను కూడా పి.ఎస్.ఎల్.వి సి-30 ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నారు. ఆయా దేశాల నుండి ఫీజు రూపేణా చాలా భారీ మొత్తం అందుతుంది కనుక ఈ ప్రయోగం కోసం చేసిన కొంత ఖర్చును భారత్ తిరిగి రాబట్టుకొన్నయింది. ఇంతవరకు ఇస్రో మొత్తం 50 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది. ఇంతకు ముందు కూడా భారత్ ఒకేసారి ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది మళ్ళీ మూడవసారి.



.png)


