ప్రముఖ రచయిత లల్లాదేవి మృతి

posted on: Oct 3, 2025 12:37PM

ప్రముఖ రచయత పరుచూరి నారాయణా చార్యులు నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తరువాత కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. పరుచేరి నారాయణా చార్యలు లల్లాదేవి అనే కలం పేరుతో పలు రచనలు చేశారు. అలాగే కొన్ని సినిమాలకు కూడా రచయతగా పని చేశారు.

2004లో విడుదలైన శ్వేత నాగు అనే చిత్రానికి లల్లాదేవే కథ రాశారు. పాములపై పరిశోధనలు చేసిన మరీ రచనలు సాగించిన ఏకైక రచయత లల్లాదేవి.  తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు లల్లాదేవి సన్నిహితుడు.  లల్లాదేవి ఎన్టీఆర్  కార్యదర్శిగా కూడా  కొంత కాలం పని చేశారు. లల్లాదేవి ప  దాదాపు 250 పై చిలుకు నవలలు రాశారు.  కొన్ని వందల  కథలు, నాటికలు, నాటకాలు కూడా రాశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...