ప్రధాని మోడీకి 9 పైసల చెక్కు

posted on: Jun 5, 2018 6:21PM

 

 

పెట్రోల్ ధర రూపాయల్లో పెంచి, పైసల్లో తగ్గిస్తారు.. సామాన్యుడికి కోపం తెప్పిస్తారు.. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కూడా ఇదే చేసింది..  పెట్రోల్ ధర అమాంతం పెంచి సామాన్యుడికి కోపం తెప్పించింది.. ఇది చాలదన్నట్టు ఒక్క పైసా తగ్గించి ఆ కోపాన్నిరెట్టింపు చేసింది.. ఇప్పుడు పెట్రోల్  ధర 9 పైసలు తగ్గించింది.. పైసల తగ్గింపు చూసి ప్రజలు, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.. అయితే సిరిసిల్లలోని చంద్రంపేటకు చెందిన  చంద్రశేఖర్, ప్రదీప్ రెడ్డి కాస్త భిన్నంగా నిరసన వ్యక్తం చేసారు.. పీఎం సహాయనిధికి 9 పైసల విరాళం ఇస్తున్నాం అంటూ.. కలెక్టర్ చేతికి 9 పైసల చెక్కు ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేసారు...

 

google-ad-img
    Related Sigment News
    • Loading...