తుది శ్వాస విడిచిన రాష్ట్రపతి ప్రణబ్ సతీమణి
Published on: Tue Aug 18, 2015 12:33PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆమె ఆమె శ్వాసక్రియకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పుడే ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. దీనిలో భాగంగానే ఆమె చికిత్స పొందుతూనే ఈరోజు ఉదయం పది గంటల యాభై నిమిషాలకు కన్నుముశారు.


