ఢిల్లీ ఎన్నికలు: ఓటేసిన రాష్ట్రపతి
posted on: Feb 5, 2025 9:06AM
.webp)
ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంల మరమ్మతు తరువాత ఆక్కడ పోలింగ్ కొనసాగనుంది. కాగా ఈ ఎన్నికలలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విశ్వవిద్యాలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే విడతలో బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.


.webp)



