నిన్న గవర్నర్.. ఈ రోజు రాష్ట్రపతి

posted on: Jun 29, 2015 3:58PM

గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ కు పాదాభివందనం చేసినందుకే చాలా మంది ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. ఇంత వరకూ ఎవరికి పాదాభివందనం చేయని కేసీఆర్ గవర్నర్ కు పాదాభివందనం చేసే సరికి అందరూ ఆశ్చర్యపోయారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రపతికి పాదాభివందనం చేసి అందరూ షాక్ అయ్యేలా చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ భారత విడిది కోసం మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో ప్రణబ్ ముఖర్జీ కి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేశారు. కాగా యాదగిరి గుట్టలో జులై 3న నిర్వహించనున్న హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. పదిరోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఉంటారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...