ప్రకాశంలో ఎమ్మెయల్సీ ఎన్నికలలో తెదేపా అభ్యర్ధి గెలుపు

 

ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెదేపా అభ్యర్ధి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైకాపాకు చెందిన తన ప్రత్యర్ధి ఎ.చిన్న వెంకట రెడ్డిపై 711ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం ఓట్లు 992 కాగా అందులో కేవలం 755 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వాటిలో శ్రీనివాసులు రెడ్డికి 724 ఓట్లు పడ్డాయి. వైకాపా అభ్యర్ధికి కేవలం 13 ఓట్లు మాత్రమే పడ్డాయి.