రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్

 

దీపావళి పండుగ సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.