లెఫ్ట్ నేతల దీక్ష భగ్నం, ఉద్రిక్తత

 

 

 

 

విద్యుత్ బిల్లుల పెరుగుదల, విద్యుత్ సరఫరా సమస్యలపై గత నాలుగు రోజులుగా ఇందిరా పార్క్‌వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్న వామపక్ష నేతలను పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. దీక్షలో ఉన్న లెఫ్ట్ నేతలు బివి రాఘవులు, నారాయణలను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. కాగా సీపీఐ నేత నారాయణ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ తగ్గిపోవడంతో ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు తక్షణం నారాయణకు వైద్య సహాయం అందించాలని పోలీసులకు సూచించారు. దీంతో లెఫ్ట్ నేతలు నారాయణ, రాఘవులు సహా పలువురు కార్యకర్తలను బలవంగా అరెస్టు చేశారు. నేతలను గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలియవచ్చింది.