పొన్నం... పూటకో మాట!

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ను పెల్చేస్తానని నోరుజారిన కరీంనగర్ ఎమ్.పి పొ్న్నం ప్రభాకర్... దానిపై వివరణ ఇచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని..తెలంగాణ ప్రజల ఆవేశాన్ని, బాధను వెల్లడించనని చెబుతున్నారు. అసెంబ్లీలో తెలంగాణ మంత్రులను కుట్రదారులుగా పేర్కొన్న ముఖ్యమంత్రిపై కేసులు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తనపై కేసులు నమోదు చేయాలని సీమాంధ్ర టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానన్న నన్నపనేనిపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌కు బిల్లు రావడం ఖాయమని, తెలంగాణ ఏర్పాటే అంతిమ విజయమని పొన్నం పేర్కొన్నారు.