మంత్రి పొన్నాల ఎన్నిక కేసు 27కు వాయిదా

posted on: Feb 21, 2013 2:05PM

 

ponnala election case, ponnala congress, ponnala lakshmaiah congress

 

ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక కేసు విచారణను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ నెల 27వ తేదికి వాయిదా వేసింది. ఈ రోజు(గురువారం) పొన్నాల లక్ష్మయ్య కోర్టుకు హాజరయ్యారు. ఆయన 2009 నాటి ఎన్నికపై వివరణ ఇచ్చారు. అనంతరం కోర్టు కేసును వాయిదా వేసింది. 2009 సాధారణ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ప్రత్యర్థి, నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పొన్నాల ఇప్పటికి మూడుసార్లు హైకోర్టుకు హాజరయ్యారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...