ఢిల్లీలో ఏం జరుగుతోంది?

posted on: Jun 19, 2013 5:27PM

 

 telangana packages, congress telangana issue

 

 

తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారన్న వార్తలు నేపథ్యంలో డిఎస్ వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. రూ.25 వేల కోట్ల తెలంగాణ అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి డీఎస్ ను చైర్మన్ గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. తెలంగాణకు ప్యాకేజీ వార్తల నేపథ్యంలో సీమాంధ్రకు కూడా ప్యాకేజీ కావాలని మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్యాకేజీ వార్తల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీ వెళ్లారు. డీఎస్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తారని, ఈ సాయంత్రానికి జానారెడ్డి ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ అంశానికి వీలయినంత త్వరగా ముగింపు పలికేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...