టీఆర్ఎస్ కి 16 ఎంపీ సీట్లు!

posted on: Jun 18, 2013 4:34PM

 

         kcr telangana, telangana kk kcr, separate telangana, trs challo assembly

 

 

కేసీఆర్ బహుముఖ ఉద్యమకారుడు. ప్రతి దానికి కేసీఆర్ వచ్చి పాల్గొనాలనడం మూర్ఖత్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరినో అడిగి బంద్‌కు పిలుపు ఇచ్చే అవసరం లేదని, టీఆర్ఎస్ ఇండిపెండెంట్ పార్టీ అని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేది టీఆర్ఎస్సే అని, 16 ఎంపీ సీట్లతో ఢిల్లీకి వెళ్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 50 వేల మందిని బైండోవర్ చేసి 'ఛలో అసెంబ్లీ' సక్సెస్ కాలేదంటున్నారు, ఇదేం ప్రజాస్వామ్యమని మండిపడ్డారు. ఆటంకాలు కలిగించి ప్రభుత్వాన్ని ఉక్కిబిక్కిరి చేశామన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు పనికిమాలిన సమావేశాలతో ఎవరిని మోసం చేస్తున్నారన్నారు. దమ్ముంటే తాడోపేడో తేల్చుకుని బయటకు రావాలని సవాల్ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...