TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నడిరోడ్డుపైనే కానిస్టేబుల్ ని నరికి చంపారు

Published on: Mon Oct 26, 2015 5:31PM

 

మెదక్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా గజ్వేల్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ను నడ్డిరోడ్డుపైనే కత్తులతో నరికి కిరాతకంగా చంపండంతో కలకలం రేగింది. వివరాల ప్రకారం నర్సింహులు అనే వ్యక్తి హైదరాబాద్ లోని బేగంపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే నర్సింహులు తన సొంత పనిమీద గజ్వేల్ వెళ్లగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపారు. దీంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కాగా నర్సింహులు హత్య జరగడానికి కటుంబకలహాలే కారణమని.. అతని భార్యకు అతనికి మధ్య విభేధాలు ఉన్నాయని అంటున్నారు. ఈనేపథ్యంలో ఆమె ఒకసారి నర్సింహులుపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. కాగా ఈ హత్య జరగడం వెనుక అతని భార్య హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నారు.