వైకాపా నేత గురునాథ రెడ్డి అరెస్ట్, అనంతపూర్ బంద్

 

వైకాపా నేత ప్రసాద రెడ్డిణి రాప్తాడు తహసిల్ దార్ కార్యాలయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొడవళ్ళతో నరికి అతి కిరాతకంగా హత్య చేయడంతో తీవ్ర ఆగ్రహం చెందిన వైకాపా కార్యకర్తలు తహసిల్ దార్ కార్యాలయంపై దాడి చేసి విద్వంసం సృష్టించారు. వైకాపా మాజీ యం.యల్యే. గురునాధ రెడ్డే వారిని ప్రోత్సహించారని ఆరోపిస్తూ రాప్తాడు పోలీసులు ఆయనని నిన్న అదుపులోకి తీసుకొన్నారు. ఆయన అరెస్టుని నిరసిస్తూ వైకాపా నేడు అనంతపురం బంద్ కి పిలుపునిచ్చింది.