పోల'వరం'తో ప్రజల ముందుకు

posted on: Sep 22, 2015 10:36AM

ఇంటింటికీ నీళ్లిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతాం...ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్, సేమ్ టు సేమ్ అలాంటిదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాడాలనుకుంటున్నారు, పట్టిసీమ సక్సెస్ తో దూకుడు మీదున్న చంద్రబాబు, అదే ఊపులో పోలవరం ప్రాజెక్టును కూడా యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట,పోలవరం పూర్తయితే, ఆ పేరుతో 2019లో ఓట్లు అడగాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట, పోలవరం పూర్తయితే ఇటు కృష్ణాడెల్టాకు, అటు ఉత్తరాంధ్రకు పుష్కలంగా నీరు ఇవ్వొచ్చని, రాయలసీమకు శ్రీశైలం నీటిని పూర్తిగా కేటాయించి ఆ ప్రాంతాన్ని కూడా సంతృప్తి పర్చాలని ఆలోచన చేస్తున్నారట, చంద్రబాబు అనుకున్నట్లుగా పోలవరం పూర్తయితే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి తిరుగుండదేమో!

google-ad-img
    Related Sigment News
    • Loading...