అప్పట్లో పెత్తనం సోనియాదే.. మోడీ

posted on: May 28, 2015 5:27PM

ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఆయన మరోమారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై, ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. అధికారాలన్నీ పీఎంవో చేతిలో కేంద్రీకృతమయ్యాయన్న ఆరోపణలపై మోడీ స్పందించి, ప్రధాని, అతని కార్యలయం రాజ్యాంగంలోని భాగం... కానీ గతంలో యూపీఏ హయాంలో పీఎంవో పై పెత్తనమంతా సోనియాదేనని, ఆమె అధికారం చలాయించేవారని మండిపడ్డారు. కానీ ఎన్డీఏ హయాంలో రాజ్యాంగబద్ధ పాలన మాత్రమే జరుగతుందని స్పష్టం చేశారు. అందుకే ఎన్నికల్లో మట్టికరుచుకు పోయిన కాంగ్రెస్ పార్టీ సూటు-బూటు సర్కార్ అంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...