ప్రధాని 64 వేల కోట్ల ప్లాన్

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా మొదటి రోజు జియాన్ చేరుకున్నారు. జియాన్ లోని జింగ్‌షాన్ ఆలయాన్ని, టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని సందర్శించిన ఆయన తరువాత ప్రముఖ బౌద్ధ దేవాలయం గోల్డెన్ టెంపుల్ ని సందర్శించి ప్రత్యేక పార్ధనలు చేశారు. అనంతరం ఆయన చైనా అధ్యక్షుడు జి షిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన వివిధ వాణిజ్య ఒప్పందాలు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై చర్చించారు. దాదాపు 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని, సుమారు 64వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 19 వరకు మోడీ చైనాలోని మంగోలియా, దక్షిణకొరియా లో పర్యటించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu