జపాన్లో మోడీ బౌద్ధాలయ సందర్శన
posted on: Aug 31, 2014 10:35AM
.jpg)
భారత ప్రధాని నరేంద్రమోడీ విదేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానికంగా వున్న ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించడం సంప్రదాయంగా మారింది. మొన్నీమధ్య నేపాల్కి వెళ్ళినప్పుడు అక్క ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు జపాన్ పర్యటనలో వున్న ఆయన టోజీలో వున్న పురాతన పగోడా బౌద్ధలయాన్ని సందర్శించారు. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ఆలయానికి వచ్చిన మోడీ ఇక్కడ అరగంటపాటు గడిపారు. చెక్కతో ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని తిలకించారు. ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఈ పగోడా బౌద్ధలయ విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రధాన బౌద్ధభిక్షువు మోరీ పగోడా బౌద్ధాలయవిశేషాలను మోడీకి వివరించారు.


.jpg)
.jpg)


